తెలంగాణ వార్తలు

ఆగస్టు 15 న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షడ్యూల్!

ఆగస్టు 15 న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షడ్యూల్!

సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు …ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం పర్యటన షడ్యూల్ విడుదల చేసింది …15 వ తేదీ గురువారం హైద్రాబాద్ లో 78 వ స్వతంత్ర దినోత్సవేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా 11 .45 గంటలు బయలుదేరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పుసుగూడం గ్రామం వద్దకు 12 గంటల 50 నిమిషాలకు చేరుకుంటారు … అక్కడే సీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్ ఫేస్ 2 ను ప్రారంభిస్తారు …పైలాన్ ఆవిష్కరణ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు … మధ్యాహ్నం 2 .15 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 2 .45 కు ఖమ్మం జిల్లాలోని వైరా చేరు కుంటారు …అక్కడ లక్షన్నర నుంచి 2 లక్షల రైతు రుణమాఫీ పాత్రలను రైతులకు అందజేస్తారు .. తర్వాత బహిరంగసభలో పాల్గొని సాయంత్రం 4 .45 గంటలకు వైరా నుంచి బయలుదేరి 6 గంటలకు బేగంపేట చేరుకుంటారని సీఎంఓ తెలిపింది ..

Related posts

పాలేరు ప్రతిపాదిత రైల్వే లైన్ పై అభ్యంతరం తెలిపిన ఎంపీ రామ సహాయం…

Ram Narayana

​తెలంగాణలో ఏడుగురు సీనియర్ అధికారుల బదిలీ

Ram Narayana

అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్!: కేంద్రమంత్రి పదవిపై కిషన్ రెడ్డి వ్యాఖ్య…

Drukpadam