Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండైన విస్తారా విమానం!

  • 180 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన విస్తారా
  • సాంకేతిక సమస్యతో 20 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసి ప్రయాణికుల తరలింపు

ఢిల్లీ వెళుతున్న ఓ విమానం శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 180 మంది ప్రయాణికులతో విస్తారా విమానం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత అందులో సాంకేతిక సమస్య తలెత్తింది.

దీంతో ఆ విమానం గాల్లోనే ఇరవై నిమిషాల ఉంది. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విస్తారా విమానంలోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక లోపం రావడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తరలించారు.

Related posts

రాహుల్ కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు.. !

Drukpadam

రాహుల్ గాంధీని ఆలయంలోకి అనుమతించని సిబ్బంది.. నడి రోడ్డుపై కూర్చుని నిరసన

Ram Narayana

ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ…

Ram Narayana

Leave a Comment