Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసుల నమోదు

  • వర్మ కోసం గాలిస్తున్న 6 పోలీసు బృందాలు
  • అరెస్ట్ భయంతో అజ్ఞాతంలో ఉన్న వర్మ
  • వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు పోలీసులు ఆయనకు రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు, అరెస్ట్ భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెల్లిపోయారు.

వర్మ కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో పోలీసులు గాలిస్తున్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని నిన్న ఒక వీడియోను వర్మ విడుదల చేశారు. మరోవైపు వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

Related posts

11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడపగా పక్కనే మందుకొట్టిన తండ్రి.. కూలిపోయిన విమానం

Ram Narayana

ఢిల్లీ లిక్కర్ కేసు.. మనీశ్ సిసోడియా బ్యాంక్ లాంకర్లను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు.. !

Drukpadam

రాజు చనిపోయినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు…హోమ్ మంత్రిని సైతం అడ్డుకున్న వైనం!

Drukpadam

Leave a Comment