తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీని సరిగా నడపలేక పోతున్నారంటూ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ దాడి…వాక్ అవుట్

వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపకలేపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కోపంతో తన చేతిలో ఉన్న పేపర్ను విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఏ అంశంపై చర్చ చేపడుతున్నారని సమాచారం ఇవ్వాలన్నారు. సభను నడిపే విధానం ఇది కాదంటూ ధ్వజమెత్తారు. ”పార్లమెంటులో కూడ చర్చించాల్సిన అంశాల గురించి ముందుగానే చెబుతారు. ఇక్కడ సభను ఎన్నిరోజులు నడుపుతారో తెలియదు. మీరు అంశంపై మాట్లాడుతున్నారో కూడా తెలియదని” అక్బరుద్దిన్ మండిపడ్డారు. వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపలేకపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related posts

అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ!

Ram Narayana

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు: కేటీఆర్

Ram Narayana

కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది, 5 సీబీఐ కేసులు కూడా పెట్టింది: సబితా ఇంద్రారెడ్డి

Ram Narayana