జాతీయ వార్తలు

ఈ నెల 29 వరకు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత…

  • ముగిసిన మండల దీక్షల సీజన్
  • నిన్న మండల పూజ అనంతరం ఆలయం మూసివేత
  • ఈ నెల 30న తిరిగి తెరుస్తామన్న ఆలయ వర్గాలు
  • జనవరి 14న మకర విళక్కు

దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్షల సీజన్ ముగిసింది. నిన్న మధ్యాహ్నం మండల పూజ అనంతరం ఆలయం మూసివేశారు. 

ఈ నెల 29 వరకు ఆలయం మూసి ఉంచుతామని, తిరిగి మకర విళక్కు సీజన్ కోసం డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. 

జనవరి 14న మకర విళక్కు పర్వదినం సందర్భంగా లక్షలాదిగా అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివస్తారు. 

కాగా, ఈ ఏడాది అయ్యప్పస్వామిని 32,39,756 మంది దర్శించుకున్నారు. గతేడాది 28,42,447 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు.

Related posts

ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదు: హర్యానాలో ఒక్క సీటూ రాకపోవడంపై కేజ్రీవాల్

Ram Narayana

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం బలి!

Ram Narayana

ఆరెస్సెస్ కార్యకలాపాలపై ఆంక్షలు.. సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు!

Ram Narayana