Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం జిల్లాలో క్రికెట్ ఆడుతూ మైదానంలో కుప్పకూలిన యువకుడు!

  • కూసుమంచి జిల్లాలో ఘటన 
  • మైదానంలో కుప్పకూలిన విజయ్ అనే యువకుడు
  • గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు

ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అతడు గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. జిల్లాలోని కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది.

ఈ టోర్నమెంట్‌లో విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. దీంతో నిర్వాహకులు అతనిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో టోర్నమెంట్ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related posts

రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం…మంత్రి పొంగులేటి …

Ram Narayana

ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో SBI మొబైల్ ATM బ్యాంకింగ్ సేవలు..

Ram Narayana

ఖమ్మంలో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్,సీపీ..!

Ram Narayana

Leave a Comment