అంతర్జాతీయం

పనామా కాలువపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

  • త్వరలోనే పవర్ ఫుల్ ప్రకటన ఉంటుందన్న అమెరికా ప్రెసిడెంట్
  • అవసరమైతే బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికీ సిద్ధమనే సంకేతాలు
  • అమెరికా దురాక్రమణకు భయపడబోమన్న పనామా ప్రెసిడెంట్

అమెరికా పౌరుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెబుతూ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకోవడం లేదంటూ పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోలపై పన్నులు విధించారు. తాజాగా పనామా కాలువపై చైనా జోక్యాన్ని తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పలుమార్లు పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. పనామా కాలువ విషయంలో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని తాజాగా వెల్లడించారు. అవసరమైతే బలవంతపు చర్యలు ఉండొచ్చనే సంకేతాలిచ్చారు. అదేసమయంలో ఇందుకోసం బలగాలను ఉపయోగించాల్సిన అవసరం ఉండకపోవచ్చని ట్రంప్ చెప్పారు.

ఏంటీ పనామా కాలువ వివాదం..?
వాణిజ్య నౌకల రాకపోకలకు పనామా కాలువ అత్యంత కీలకం. పనామాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుని ఈ కాలువను 1914 లో నిర్మించింది. 1999 లో కాలువను పనామాకు అప్పగించింది. ఆ తర్వాత కాలువపై చైనా జోక్యం పెరిగిపోయిందని అమెరికా ఆరోపణలు గుప్పించింది. తమ నౌకల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తోందంటూ పనామాపై విమర్శలు చేసింది. ఫీజులు తగ్గించకపోతే కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పలు సందర్భాలలో హెచ్చరించింది.

తాజాగా ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. పనామా కాలువను పరోక్షంగా చైనా నిర్వహిస్తోందని, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అందుకే పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, అగ్రరాజ్యం అమెరికా దురాక్రమణకు భయపడబోమని, ఈ విషయంలో అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పనామా ప్రెసిడెంట్ జోస్‌రౌల్‌ ములినో తేల్చిచెప్పారు.

ట్రంప్ మరో బాంబ్.. యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య యుద్ధానికి సై

Trump hints at imposing tariffs on European Union
  • ఈయూపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
  • అది తమతో దారుణంగా వ్యవహరించిందని విమర్శ 
  • అదే జరిగితే తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామన్న ఈయూ

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాపై భారీగా సుంకాలు విధించిన ట్రంప్.. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు హెచ్చరికలు జారీ చేశారు. ఈయూ తమతో దారుణంగా వ్యవహరించిందని, దానిపై సుంకాలు విధించక తప్పదని పేర్కొన్నారు. 

ట్రంప్ హెచ్చరికలపై ఈయూ కూడా తీవ్రంగానే స్పందించింది. ట్రంప్ అన్నంత పనీ చేస్తే తాము కూడా గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూనే చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది.

27 దేశాల యూరోపియన్ యూనియన్‌పై సుంకాల విధింపు గురించి ఆలోచిస్తున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘ఈయూపై సుంకాలు విధిస్తాం. మీకు నిజమైన సమాధానం కావాలా? లేక రాజకీయ పరమైన సమాధానం కోరుకుంటున్నారా?’’ అని అయన ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ తమను దారుణంగా ట్రీట్ చేసిందని ఆయన విమర్శించారు. ట్రంప్ తన మొదటి విడత పదవీకాలంలోనూ యూరోపియన్ యూనియన్ స్టీల్, అల్యూమినియం ఎగుమతులపై భారీగా సుంకాలు విధించారు. ఇది ఈయూతో వాణిజ్య యుద్ధానికి దారితీసింది. ప్రతిగా యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ఎగుమతి అయ్యే విస్కీ, మోటార్ సైకిళ్లు సహా పలు వస్తువులపై సంకాలు విధించి ప్రతీకారం తీర్చుకుంది.   

Related posts

బలూచిస్థాన్ నేత ‘స్వాతంత్ర్య’ ప్రకటన.. ఢిల్లీలో రాయబార కార్యాలయం కోసం భారత్‌కు విజ్జప్తి!

Ram Narayana

అమెరికాలో భారతీయ యువకుడి హత్య.. కారులో ఉండగా తుపాకీతో కాల్పులు

Ram Narayana

ఉగాండాలో డీఎన్ఏ టెస్టుల కలకలం.. చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు…

Ram Narayana