Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జైలు నుండి విడుదలైన పోసాని కృష్ణమురళి!

  • నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • రెండు వారాలకు ఒకసారి సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలని ఆదేశం
  • పోసానికి జైలు బయట స్వాగతం పలికిన అంబటి రాంబాబు

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా కారాగారం నుండి విడుదలయ్యారు. పోసానికి నిన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాలకు ఒకసారి సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలని ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానికి వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వాగతం పలికారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కారులో ఇంటికి వెళ్లారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో పోసాని అరెస్టయ్యారు. సీఐడీ కోర్టు పోసానికి నిన్న బెయిల్ మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో జాప్యం కావడంతో విడుదల ప్రక్రియ ఆలస్యమైంది. అన్ని ఫార్మాలిటీలు పూర్తి కావడంతో నేడు సాయంత్రం విడుదలయ్యారు.

Related posts

హిందువులకు అరుదైన గౌరవం.. అమెరికాలోనూ దీపావళి సెలవు!

Drukpadam

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత్ చిత్తు చిత్తు..10 వికెట్లతో గెలిచిన ఇంగ్లాండ్ !

Drukpadam

తెలంగాణలో 11.36 లక్షల ఓటర్ల తొలగింపు!

Drukpadam

Leave a Comment