తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియపై గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల గ్రూప్-1 ఫలితాలపై రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. రెండు సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. తెలుగు మీడియం విద్యార్థులను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వచ్చాయి.
next post