Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం .. మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోదీ

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా (Air India) బోయింగ్‌ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్కరు రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రమేశ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పరామర్శించారు. శుక్రవారం ఉదయం ప్రమాద స్థలిని సందర్శించిన మోదీ.. అక్కడి నుంచి నేరుగా సివిల్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ క్రమంలో విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేశ్‌ను కూడా మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతడికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

బ్రిటిష్‌ జాతీయుడైన (British national ) 38 ఏండ్ల రమేశ్‌ విమానంలో 11ఏ సీటులో కూర్చున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్‌ వెనుక ఈ సీటు ఉంటుంది. తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్‌కు వచ్చిన రమేశ్‌ తన సోదరుడు అజయ్‌ కుమార్‌ రమేశ్‌(45)తో కలసి లండన్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. విమానంలోని 11ఏ సీటులో కూర్చున్న రమేశ్‌ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు. విమానం టేకాఫ్‌ అయిన 30 సెకండ్లకే భారీ శబ్దం వినిపించిందని, అంతలోనే విమానం కూలిపోయిందని తెలిపాడు. అంతా క్షణాలలో జరిగిపోయింది అని రమేశ్‌ చెప్పుకొచ్చారు.ప్రమాదంలో రమేశ్‌కు ఛాతీ, కళ్లు, కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి. అంతకుముందు, విమానం కూలిపోయి దగ్ధమవుతుండగా గాయపడిన రమేశ్‌ అంబులెన్సు వైపు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విమానంలో ఇతర ప్రయాణికుల పరిస్థితి గురించి స్థానికులు రమేశ్‌ను అడగడం కనిపించింది. విమానం పేలిపోయింది అని గుజరాతీలో రమేశ్‌ చెప్పడం వినిపించింది.

ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ 787-8(డ్రీమ్‌లైనర్స్‌)లో 11ఏ సీటు ఎకానమీ క్లాస్‌ క్యాబిన్‌కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది. బిజినెస్‌ క్లాస్‌కి వెనుక ఉంటుంది. క్యాబిన్‌కి అభిముఖంగా కూర్చుని చూస్తే ఎడమ వైపున 11ఏ సీటు ఉంటుంది. విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి రెండు వరుసల ముందు ఈ విండో సీటు ఉంటుంది. ప్రమాద సమయాలలో సురక్షిత సీటుగా పరిగణించే 11ఏ సీటు ఎమర్జెన్సీ డోర్‌కు వెనుకనే ఉంటుంది.

Related posts

రాష్ట్రాల ఏర్పాటుకు ఇదే వేదికైంది.. పార్లమెంట్ పాత భవనంపై మోదీ

Ram Narayana

రతన్ టాటా జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు !

Ram Narayana

ఢిల్లీలో భారీ పేలుడు క‌ల‌క‌లం…

Ram Narayana

Leave a Comment