ఆంధ్రప్రదేశ్

బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి
  • చెవిరెడ్డిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ
  • చెవిరెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించే అవకాశం

వైసీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై మద్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు…

Ram Narayana

ప్రధాని మోదీతో అరగంట పాటు భేటీ అయిన సీఎం జగన్

Drukpadam

లండన్ లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన బ్రెజిల్ యువకుడు

Drukpadam