YS Jagan
ఆంధ్రప్రదేశ్

సింగయ్య మృతి కేసులో జగన్ కు నోటీసులు

  • ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించిన జగన్
  • సింగయ్య అనే వ్యక్తి మృతి
  • జగన్ ను ఏ2గా చేర్చిన పోలీసులు 
  • నేడు వైసీపీ ఆఫీసులో నోటీసులు అందించిన పోలీసులు

ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి వైసీపీ అధినేత జగన్ ను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో జగన్ ను ఏ2గా పేర్కొన్న పోలీసులు… తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు నోటీసులతో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యాలయ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అంతేకాదు, సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Related posts

ఆదాయం రూ.7 లక్షలకు పైన కొంచెం ఉంటే పన్ను లేదు!

Drukpadam

జీతాలు పెంచాలని కార్మికుల ఆందోళన… ఏపీ పేపర్ మిల్ లాకౌట్..

Ram Narayana

 చీఫ్ విప్ లు, విప్ లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Ram Narayana