Siddaramaiah
జనరల్ వార్తలు ...

కొవిడ్ టీకాలపై సిద్ధరామయ్య వ్యాఖ్యలు .. తీవ్రంగా స్పందించిన కిరణ్ మజుందార్ షా

  • కొవిడ్ టీకాల వల్లే గుండెపోటు మరణాలు కావొచ్చని సిద్ధరామయ్య అనుమానం
  • ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయన్న కిరణ్ షా
  • లక్షల ప్రాణాలు కాపాడిన టీకాలపై నిందలు తగదని వ్యాఖ్య
  • హాసన్ జిల్లా మరణాలపై కమిటీ వేసిన కర్ణాటక ప్రభుత్వం
  • కొవిడ్ టీకాలకు, మరణాలకు సంబంధం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టీకరణ

కర్ణాటకలో ఇటీవల సంభవించిన గుండెపోటు మరణాలకు కొవిడ్ టీకాలే కారణం కావొచ్చంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందార్ షా తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌లో అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌లు అత్యవసర వినియోగ నిబంధనల ప్రకారమే అనుమతి పొందాయని కిరణ్ షా స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని తయారు చేశారని గుర్తుచేశారు. “ఈ టీకాలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయి. వీటిపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదు. దుష్ప్రభావాలు చాలా అరుదుగా నమోదయ్యాయి. వ్యాక్సిన్‌లపై నిందలు వేయడం ఆపి, వాటి వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని గౌరవించాలి” అని ఆమె పేర్కొన్నారు.

గత నెలలో హాసన్ జిల్లాలో 20 మందికి పైగా గుండెపోటుతో మరణించడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మరణాల వెనుక కచ్చితమైన కారణాలను తేల్చేందుకు ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కొవిడ్ వ్యాక్సిన్‌లను ప్రజలకు హడావుడిగా అందించడం కూడా ఈ మరణాలకు ఒక కారణమై ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కమిటీని ఆదేశించారు. ఇదిలా ఉండగా, యువతలో ఆకస్మిక మరణాలకు జీవనశైలి, ఇతర ఆరోగ్య సమస్యలే కారణమని, కొవిడ్ టీకాలు కాదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన అధ్యయనాల్లో ఇదే విషయం తేలిందని పేర్కొంది. దేశీయ వ్యాక్సిన్‌లు సురక్షితమైనవని, వాటి సామర్థ్యం నిరూపితమైందని, తీవ్రమైన దుష్పరిణామాలు అత్యంత అరుదు అని వెల్లడించింది.

Related posts

కరోనా టీకాలతో ముప్పా …?

Drukpadam

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి పితృ వియోగం

Ram Narayana

Tech News – BNZ flips switch on Apple Pay in New Zealand

Ram Narayana