Raghunandan Rao
తెలంగాణ వార్తలు

‘ఇందిరమ్మ ఇళ్ల’లో ఎంపీలకు 40 శాతం కోటా ఇవ్వండి: రేవంత్ కు రఘునందన్ లేఖ

  • లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40 శాతం కోటా కేటాయించాలని రఘునందన్ వినతి
  • పార్టీలకు అతీతంగా 17 మంది ఎంపీలకు ఈ అవకాశం కల్పించాలని సూచన
  • దీనివల్ల లబ్ధిదారుల ఎంపిక మరింత పారదర్శకంగా ఉంటుందని వ్యాఖ్య

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పార్లమెంటు సభ్యులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40 శాతం కోటా కేటాయించాలంటూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు ఓ లేఖ రాశారు. ఈ నిర్ణయం ద్వారా పేదలకు మరింత న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలు కూడా ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులని రఘునందన్ రావు తన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల, ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని మొత్తం 17 మంది ఎంపీలకు ఈ కోటాను వర్తింపజేయాలని ఆయన సూచించారు. దీనివల్ల లబ్ధిదారుల ఎంపికలో సహేతుకత, పారదర్శకత పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎంపీగా పనిచేశారన్న విషయాన్ని రఘునందన్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులను ఇందిరమ్మ ఇళ్ల పథకంతో అనుసంధానించడాన్ని ఆయన స్వాగతించారు. తన అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వెంటనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 

Related posts

ఈ నెల 17న ఒక్క రైలును కూడా కదలనివ్వం : కవిత

Ram Narayana

అక్కంపల్లి రిజర్వాయర్‌లో వందలాది చచ్చిన కోళ్లు..

Ram Narayana

నల్లగొండలో అమాన‌వీయ ఘ‌ట‌న‌..వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే ప్రసవించిన మహిళ!పైగా హాస్పటల్ కు వచ్చిన గర్భిణీ మహిళను దుర్బాషలాడిన సిబ్బంది

Ram Narayana