జాతీయ వార్తలు

చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్…

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనకు కళ్లు తిరిగినట్టు అనిపించింది. దీంతో, ఆయనను హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. స్టాలిన్ ను ఆసుపత్రిలో చేర్పించే సమయంలో ఆయన కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి కూడా ఆయన వెంట ఉన్నారు. మరోవైపు, స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా, అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ స్పందిస్తూ… ఆరోగ్యపరంగా స్టాలిన్ కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఆయన లక్షణాలను పరిశీలించామని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.

Related posts

బీజేపీని ఓడించలేమని తేల్చేసింది: కాంగ్రెస్‌కు థ్యాంక్స్ చెప్పిన స్మృతి ఇరానీ..!

Drukpadam

28 ఏళ్లకే ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి విదేశాలకు పారిపోయేదాకా.. ప్రజ్వల్ రేవణ్ణ పతనం!

Ram Narayana

హిమాచల్ ప్రదేశ్ సీఎంకు సమోసాలు ఆర్డర్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే…

Ram Narayana