ఆంధ్రప్రదేశ్

జగన్ సెక్యూర్టీలో మరో 40 ప్రవేట్ గార్డ్స్ …

జెడ్ ప్లస్ భద్రత కలిగి ఉన్న ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనల్లో జనం తోసుకొని వాహనం మీదకు రావడం ,ప్రస్తుతం ఉన్న సిబ్బంది కంట్రోల్ చేయలేకపోవడంతో భద్రతను పెంచడంతోపాటు మరింత కట్టుదిట్టం చేయాలనీ వైసీపీ నిర్ణయించింది …ఇందుకోసం ఇప్పుడున్న సెక్యూరిటీకి తోడు మరో 40 మంది ప్రవేట్ సెక్యూరిటీని తీసుకోవాలని నిర్ణయించారు ..రోప్ పార్టీ ప్రత్యేక సెక్యూరిటీలో ఆ 40 మంది ఉండేలా చర్యలు చేపట్టారు …ఇప్పటికే జగన్ సెక్యూర్టీలో 10 మంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఉన్నారు ..వారి పర్వేక్షణలో సెక్యూర్టీ విభాగం పనిచేస్తుంది …పర్యటనల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటారు …ఈనెల 6 న డోన్ పర్యటనలో ఈ మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది …జగన్ కు అదనపు సెక్యూర్టీ కావాలని రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలను కోరారు ..కోర్ట్ ను కూడ ఆశ్రయించారు …అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న భద్రత సరిపోతుందని అదనపు భద్రత అవసరం లేదని తేల్చి చెప్పింది …దీంతో జగన్ తన భద్రత కోసం సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు …

Related posts

నన్ను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారు ..జరిగిన సంఘటనలపై జడ్జికి వివరించిన అంబటి ..

Ram Narayana

ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!

Drukpadam

జీఎస్టీ సమావేశంలో భట్టి

Ram Narayana