తెలంగాణ వార్తలు

భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ!

  • 48 అడుగులు దాటిన నీటిమట్టం
  • రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • కల్యాణ కట్ట వరకు చేరిన వరద నీరు
  • నాలుగు మండలాలకు నిలిచిపోయిన రాకపోకలు
  • జలదిగ్బంధంలో వీఆర్ పురం, కూనవరం, చింతూరు

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈ ఉదయం 9 గంటల సమయానికి నీటిమట్టం 48 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వరద ప్రభావంతో స్నాన ఘట్టాల ప్రాంతంలోని మెట్లు, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. పవిత్ర స్నానాలు ఆచరించే కల్యాణ కట్ట వరకు వరద నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. ఈ నేపథ్యంలో భక్తులు ఎవరూ నదిలోకి స్నానాలకు వెళ్లవద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

గోదావరి ఉద్ధృతి కారణంగా తూరుబాక వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం వంటి నాలుగు మండలాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు, గోదావరి వరద పలు ఏజెన్సీ మండలాలను ముంచెత్తింది. వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Related posts

బీర్ల ధరలను 33 శాతం పెంచాలని యూబీ కోరుతోంది… అలా పెంచితే వారికి భారం: మంత్రి జూపల్లి !

Ram Narayana

మధురై కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫొటోలను క్లిక్‌మనిపించిన కాంగ్రెస్ నేత

Ram Narayana

హైదరాబాద్ నగరం గూగుల్ మ్యాప్స్‌పై చిరంజీవి! మెగాభిమానం అంటే ఇదే!

Ram Narayana