తెలంగాణ రాజకీయ వార్తలు ..

రిజర్వేషన్లు కోర్ట్ లో చెల్లవు అని తెలిసినా, ఎన్నికల తంతు ఏమిటి …ఈటెల ప్రశ్న

  • ఎవరిని మోసం చేయడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ప్రశ్న
  • బీహార్, మహారాష్ట్రలలో రిజర్వేషన్లపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని వెల్లడి
  • కోర్టుకు వెళ్లవద్దని మంత్రులు చెబుతున్నారు.. వెళితే అభ్యంతరమేమిటని ప్రశ్న

కోర్టులో చెల్లవని తెలిసినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించి గందరగోళానికి గురి చేస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ఎవరిని మోసం చేయడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ, బీహార్, మహారాష్ట్రలలో రిజర్వేషన్లపై నమోదైన పలు కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని అన్నారు.

ఎవరూ కోర్టుకు వెళ్లవద్దని ముగ్గురు మంత్రులు చెబుతున్నారని, కోర్టుకు వెళితే అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నానని ఈటల అన్నారు. ఎన్నికల్లో ఓటు కోసం డబ్బులు ఖర్చు పెట్టవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెబుతోందని అన్నారు. నల్గొండ జిల్లాలోని గిరిజన తండాల్లో బీసీలు లేకున్నా రిజర్వేషన్ ప్రకటించారని విమర్శించారు. తమ పార్టీ తరఫున శాసనసభలో, మండలిలో పూర్తిగా మద్దతు ఇచ్చామని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీని అనవద్దని సూచించారు.

Related posts

బీఆర్ యస్ పై బాలసాని గరం గరం …మంత్రి పువ్వాడ , ఎంపీ వద్దిరాజు బుజ్జగింపులు…

Ram Narayana

కవిత రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana

రేవంత్ రెడ్డిలో భయం మొదలైంది: బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి

Ram Narayana