తెలంగాణ రాజకీయ వార్తలు ..

జూబ్లీహిల్ల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతు బీజేపీకే…?

  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్న టీడీపీ
  • పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించిన చంద్రబాబు
  • ఏపీలో బీజేపీతో పొత్తు ధర్మమే కారణమని వెల్లడి
  • మద్దతు కోరితే బీజేపీకి సహకరించేందుకు సుముఖత
  • కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు మద్దతిచ్చేది లేదని స్పష్టీకరణ
  • తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని నేతలకు ఆదేశం
  • జూబ్లీహిల్ల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతు బీజేపీకే…?

మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 11 జరగబోయే ఎన్నికల్లో టీడీపీ మద్దతు బీజేపీకి ఇవ్వనున్నట్లు అధినేత చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు …అయితే వారు అడగకుండానే మద్దతు ఇవ్వడంపై ఆయన నేతలతో మాట్లాడుతూ వారు అడిగితేనే మద్దతు ఇద్దామని చెప్పారు …తాము ఇప్పటికే ఎన్డీయే కూటమిలో ఉన్నందున బీజేపీకే మద్దతు అని చంద్రబాబు టీడీపీ తెలంగాణ నేతలతో మంగళవారం ఉండవల్లి లో జరిగిన సమావేశంలో చెప్పినట్లు సమాచారం …

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఉప ఎన్నికపై టీడీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల బరిలో నిలబడకూడదని, పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం రాత్రి తెలంగాణ టీడీపీ నేతలతో జరిపిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పొద్దుపోయేంత వరకు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ప్రస్తుతం ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేవన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దీంతో పోటీ నుంచి తప్పుకోవడమే సరైనదని అధినేత నిర్ణయించారు.

అదే సమయంలో పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీకి పొత్తు ఉన్నందున, తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ బీజేపీ నాయకత్వం అధికారికంగా మద్దతు కోరితే, వారితో కలిసి పనిచేయాలని, లేనిపక్షంలో తటస్థంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అయితే, కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ ప్రజల్లో టీడీపీ పట్ల ఇప్పటికీ అభిమానం ఉందని గుర్తుచేసిన చంద్రబాబు, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ పార్టీని తిరిగి బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని నేతలకు సూచించారు.

Related posts

చింతమనేని, నూజివీడు డీఎస్పీ మధ్య వాగ్వాదం…

Ram Narayana

కమీషన్ల పేరుతో మీ నాయకులు చేస్తున్న దోపిడీపై చర్యలు తీసుకోండి: కేసీఆర్ కు కోమటిరెడ్డి  లేఖ

Ram Narayana

తెలంగాణ బీజేపీలో కలవరం.. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన 10 మంది జంప్…

Ram Narayana