ఎలక్షన్ కమిషన్ వార్తలు

ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ గడువు.. 150కి పైగా నామినేషన్లు!

  • నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు ముగిసిన నామినేషన్ గడువు
  • గేటు లోపల ఉన్న వారికి నామినేషన్ వేయడానికి అవకాశం
  • బరిలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ దాఖలు చేయడానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉండగా, ఆ సమయానికి గేటు లోపల ఉన్నవారికి నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.

ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Related posts

రిటైర్మెంట్ తర్వాత కొన్ని నెలలు అందరికీ దూరంగా వెళతా: సీఈసీ రాజీవ్ కుమార్

Ram Narayana

రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలు ఖండించిన ఈసీ …ఈసీ వివరణ వింటుంటే నవ్వొస్తుందన్న కాంగ్రెస్ …!

Ram Narayana

దేశంలో ముగిసిన రెండో దశ ఎన్నికల పోలింగ్..!

Ram Narayana