క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ఆన్‌లైన్‌లో రూ. 4 కోట్ల వాచ్ ఆర్డరిస్తే.. చేతికొచ్చింది రూ. 400 వాచ్!

  • చెన్నైలో వెలుగులోకి వచ్చిన భారీ ఆన్‌లైన్ మోసం
  • రూ.4 కోట్ల వాచ్‌ కోసం ఓ యువకుడు రూ.2.3 కోట్ల చెల్లింపు
  • డెలివరీలో రూ.400 విలువైన వాచ్ రావడంతో షాక్
  • బాధితుడు చెన్నైలోని ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి కుమారుడు
  • కొట్టూరుపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ఆన్‌లైన్ షాపింగ్‌లో జరిగిన ఓ భారీ మోసం చెన్నై నగరంలో కలకలం రేపింది. ఏకంగా రూ.4 కోట్ల విలువైన లగ్జరీ చేతి గడియారం కోసం ఆర్డర్ ఇస్తే, తీరా డెలివరీలో కేవలం రూ.400 విలువ చేసే వాచ్ రావడంతో బాధితుడు కంగుతిన్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వస్త్రదుకాణం యజమాని కుమారుడు ఇటీవల ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో రూ.4 కోట్ల విలువైన చేతి గడియారాన్ని చూశాడు. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆసక్తి చూపాడు. వెంటనే స్థానిక బోట్‌క్లబ్ ప్రాంతానికి చెందిన ఓ ఏజెంట్‌ను సంప్రదించి, ఆ వాచ్ కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాడు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఆ వాచ్ కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో రూ.2.3 కోట్లు చెల్లించాడు.

మంగళవారం అతడికి ఆ వాచ్ పార్శిల్ అందింది. ఎంతో ఆత్రుతతో పార్శిల్ విప్పి చూడగా, అందులో కేవలం రూ.400 విలువైన చౌకబారు వాచ్ ఉండటాన్ని చూసి నివ్వెరపోయాడు. తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు, వెంటనే కొట్టూరుపురం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ భారీ మోసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

త్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం.. అసలు ఏమిటీ బడ్జెట్?

Ram Narayana

సహ విద్యార్థిపై టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కిరాతకం.. 30 సెకన్లలో 27 కత్తిపోట్లు…

Ram Narayana

హర్యానాలో పాక్ గూఢచారి… యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్!

Ram Narayana