వారెవ్వా ఎస్ ఐ మాస్టర్ ప్లాన్ బట్టబయలైంది …
పట్టుకున్న నిరతుడిని 2 కోట్లు తీసుకోని వదిలేసిన ఎస్ ఐ
డిపార్ట్మెంటల్ విచారణలో వెలుగులోకి
రూ.3 వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రూ.2 కోట్లు తీసుకొని వదిలేసిన హైదరాబాద్కు చెందిన ఎస్ఐ..ఇటీవల రూ.3 వేల కోట్లు కొల్లగొట్టి ఆర్థిక నేరం చేసి ముంబయికి పారిపోయిన నిందితుడు.ఆ నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి పంపిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్.. ముంబయిలో ఆ నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొస్తుండగా నిందితుడితో రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకున్న ఎస్ఐ .. ప్లాన్ ప్రకారం తన వెంట వచ్చిన ఇతర పోలీసులను వేరే వాహనంలో పంపించి, తాను మాత్రం నిందితుడితో వేరే వాహనంలో వెళ్లే విధంగా, రెండు వాహనాలకు మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉండేలాగా ఎస్ఐ మాస్టర్ ప్లాన్ చేశాడు ..మార్గ మధ్యలో నిందితుడి సభ్యులకు ఫోన్ చేసి ఒక హోటల్ వద్దకు రూ.2 కోట్లు క్యాష్ తీసుకురావాలని ఆదేశించిన ఎస్ఐ ..దాని ప్రకారం
హోటల్లో డబ్బులు తీసుకుని నిందితుడిని వదిలేసి.. తాను వాహనం ఆపినప్పుడు పారిపోయాడని ఉన్నతాధికారులను నమ్మించి సదరు ఎస్ఐ.
దీనిపై పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వేసింది …ఆ విచారణలో ఎస్ ఐ డ్రామాలు అన్ని బయటపడ్డాయి.. నిందితుడివద్ద డబ్బులు తీసుకుని ఎస్ఐ ఆ నిందితుడిని వదిలేసినట్టు నిర్ధారించిన ఉన్నతాధికారులు.2020 బ్యాచ్కు చెందిన సదరు ఎస్ఐ, గత కొన్నేళ్లుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన దర్యాప్తు బృందాలు…

