Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ తెలుగు మహాసభలకు తేదీలు ఖరారు…

  • జనవరిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
  • గుంటూరులో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు
  • ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో వేడుకలు
  • తెలుగు వైభవ పురస్కారాలకు ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
  • గవర్నర్‌ను ఆహ్వానించిన గజల్ శ్రీనివాస్

ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2026 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు గుంటూరు వేదికగా ఈ మహాసభలు నిర్వహించబడతాయి. ఇందులో భాగంగా జనవరి 4న జరిగే “తెలుగు వైభవ పురస్కారాల” ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యేందుకు అంగీకరించారు.

ఈ మేరకు పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ హైదరాబాద్‌లో గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మహాసభలకు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని ఇంద్రసేనారెడ్డి హామీ ఇచ్చారన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, మాతృభాష అయిన తెలుగును నిలబెట్టుకోవడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని గుర్తుచేశారు. కాగా, గుంటూరులోని అమరావతి శ్రీసత్య సాయి స్పిరుచ్యువల్‌ సిటీ ప్రాంగణంలో (హైవే) ఉన్న నందమూరి తారకరామారావు వేదికపై ఈ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Related posts

ఆనందయ్య మందుపై : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు!

Drukpadam

హరీశ్ రావుకు కూడా నాకు పట్టిన గతే పడుతుంది: ఈటల

Drukpadam

మల్లన్న గెలుపుకు సహకరించాలి …సిపిఎం , సిపిఐ, పార్టీలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి ..!

Ram Narayana

Leave a Comment