తెలంగాణ వార్తలు

కోరిక తీరకుండానే… గుండెపోటుతో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మృతి…

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి గుండెపోటుతో మృతి
  • బీఆర్ఎస్ మద్దతుతో చింతల్‌ఠానా నుంచి బరిలో నిలిచిన మురళి
  • తొలి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నడుమ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రజా సేవ చేయాలనే ఆశయంతో సర్పంచ్ బరిలో నిలిచిన ఓ అభ్యర్థి, గెలుపు ముంగిట గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వేములవాడ అర్బన్ మండలం, చింతల్‌ఠానా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. చింతల్‌ఠానా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో చెర్ల మురళి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం పలు ప్రణాళికలతో ఆయన ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, గురువారం ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సర్పంచ్‌గా గెలిచి గ్రామస్థులకు సేవ చేయాలన్న తన కల నెరవేరకుండానే ఆయన అర్ధాంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

తొలి విడతలో 395 పంచాయతీలు ఏకగ్రీవం
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 4,236 గ్రామాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, 395 గ్రామాలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు ఏకగ్రీవం కాగా, ఆదిలాబాద్ జిల్లా 33 ఏకగ్రీవాలతో రెండో స్థానంలో నిలిచింది. అత్యల్పంగా కరీంనగర్‌లో మూడు, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నాలుగేసి గ్రామాలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి.

మరో ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో తొలి విడతలో 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవి కోసం 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Related posts

పొద్దుటూరు లో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి ..

Ram Narayana

రాష్ట్ర కొత్త గవర్నర్ దంపతులతో సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వక భేటీ …

Ram Narayana

మా లక్ష, లక్ష్యం నెరవేరింది…రండి తలలు లెక్కపెట్టుకోండి …కూనంనేని సవాల్ …

Drukpadam