ఖమ్మం వార్తలు

పాతర్లపాడు గ్రామం లో ఎగిరిన ఎర్రజెండా …సర్పంచ్ సీటు కైవశం

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా సిపిఎం అభ్యర్థి 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ..మొత్తం 12 వార్డులు ఉండగా 11 వార్డుల్లో విజయం సాధించారు ..దీంతో ఈ గ్రామంలో ఎర్రజెండాకు తిరుగులేదని మరోసారి గ్రామ ప్రజలు నిరూపించారు…ఇటీవలే మాజీ సర్పంచ్ , సిపిఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్య జరిగింది . ఆయనకు ఈ తీర్పు ద్వారా మరోసారి గ్రామ ప్రజలు ఘనమైన నివాళులు అర్పించినట్లైంది .. జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ హత్య విషయంపై ఇప్పటివరకు హంతకులు ఎవరు అనేది నిగ్గు తేలకపోవడం చర్చనీయాంశంగా మారింది .. హత్యకు సంబంధించిన వివారాలు పోలీసులు ఇప్పటివరకు తేల్చలేకపోయారనే విమర్శలు ఉనాన్యి …దీంతో పోలీస్ శాఖ వైఫ్యలంపై సిపిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది …హత్య ఎవరు చేశారు ..అనేదాన్ని నిగ్గుతేల్చలేపోతున్న పోలీస్ శాఖపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..

Related posts

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి….. జిల్లా కలెక్టర్

Ram Narayana

పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని వద్దిరాజు విస్త్రత ప్రచారం …

Ram Narayana

జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రక్కదారిపై విచారణ పూర్తి..అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ

Ram Narayana