ఖమ్మం వార్తలు

ఖమ్మంలో మహిళ దారుణ హత్య

Pramila Murdered Brutally in Khammam
  • ఖమ్మం కస్బాబజారులో ఘటన 
  • హతురాలు భద్రాచలానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడి భార్య ప్రమీలగా గుర్తింపు
  • శ్రావణ్ వేధింపులకు గురి చేస్తున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రమీల కుటుంబ సభ్యులు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఖమ్మం నగరంలో గత రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కస్బాబజార్‌లోని ఓ మాల్‌ పక్క సందులో సుమారు 35 ఏళ్ల వయసున్న మహిళ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఖమ్మం ఒకటో పట్టణ ఎస్ఐ మౌలానా ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హతురాలు భద్రాచలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడి భార్య ప్రమీలగా గుర్తించారు.

పిల్లలు లేకపోవడంతో గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్రమీలను భర్త స్నేహితుడు శ్రావణ్‌ కొద్దినెలలుగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల క్రితం భద్రాచలంలో శ్రావణ్‌పై ప్రమీల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

తనకు సహకరించకపోవడమే కాకుండా తనపై కేసు పెట్టిందన్న కోపంతో శ్రావణ్‌ ఈ ఘతకానికి పాల్పడి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Related posts

ఖమ్మంలో ఘనంగా ఎన్టీఆర్ వర్దంతి …వివిడిగా..కలివిడిగా కాంగ్రెస్ టీడీపీలు..

Ram Narayana

జర్నలిస్టుపై దాడి పట్ల టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) ఖండన

Ram Narayana

ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ,ఖమ్మం ప్రజానీకం ఆకాంక్షల కోసం పనిచేస్తా…తుమ్మల

Ram Narayana