తెలంగాణ వార్తలు

ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారులపై ప్రచారం సరికాదు: శ్రీధర్ బాబు…

  • ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు
  • నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారులపై తప్పుడు ప్రచారం సరికాదన్న మంత్రి
  • రాజకీయ వైరుధ్యాలు ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలన్న మంత్రి

ప్రభుత్వంలోని పెద్దలు, ఐఏఎస్ అధికారులపై కొన్ని రోజుల కిందట మీడియాలో జరిగిన ప్రచారం సరికాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంలో నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారులపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మంత్రి మీడియాతో అన్నారు. ఇది మంచి సంస్కృతి కాదని, ఇలాంటి ప్రచారాలను దయచేసి ప్రోత్సహించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా అసత్య కథనాలను ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఈ సమయంలో విషపూరిత ప్రచారం చేయడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలని సూచించారు. కానీ అబద్ధపు ప్రచారాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఒక ప్రధాన టీవీ ఛానల్‌లో ఈ ప్రచారం జరగడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

ప్రభుత్వ పథకాల అమల్లో ఉద్యోగులే కీలకం వారే రథసారధులు ..సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

సామాజిక న్యాయం కోసమే ఈ సర్వే: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Ram Narayana

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జైజై లు పలుకుతున్నజర్నలిస్ట్ సమాజం!

Ram Narayana