సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై విచారణ
స్పీకర్కు నాలుగు వారాలు గడువు
ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టుకు నివేదిక
సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో స్పీకర్ విఫలమయ్యారన్న బీఆర్ఎస్ లాయర్
మిగతా ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్కు 4 వారాల గడువిచ్చిన ధర్మాసనం
- పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు సుప్రీంకోర్టు నాలుగు వారాలు గడువు ఇచ్చింది
- ఈ నాలుగు వారాల్లో ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తిచేసి నిర్ణయం వెలువరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది
- పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సత్వరమే నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టీస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది
- ఈ విచారణలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో స్పీకర్ పూర్తిగా విఫలమయ్యారని పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్, కేటీఆర్ తరపు న్యాయవాదులు వివరించారు
- విచారించిన ధర్మాసనం స్పీకర్ కు 4 వారాల సమయమిస్తూ వాయిదా వేసింది