అంతర్జాతీయం

ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ… 69కి చేరిన ఆత్మాహుతి దాడి మృతుల సంఖ్య!

  • మృతుల సంఖ్య 69కి చేరగా, 169 మందికి గాయాలు
  • నగరంలో ఎమర్జెన్సీని ప్రకటించినట్లు పోలీసు అధికారి వెల్లడి
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు

ఆత్మాహుతి దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ విధించింది. ఇస్లామాబాద్‌లోని షియా మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మృతుల సంఖ్య 69కి చేరగా, 169 మంది గాయపడ్డారు. నగరంలోని షెహ్జాద్ టౌన్ ప్రాంతంలో గల షియా మసీదు ప్రధాన ద్వారం వద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల సమీపంలోని భవనాలు, కిటికీలు కూడా పగిలిపోయాయి.

పేలుడు అనంతరం నగరంలో నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించినట్లు ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్, పాలీక్లినిక్ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, పలువురు మృతి చెందారని అన్నారు. ఆత్మాహుతి దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

Related posts

అగ్రరాజ్యంలో ఆదివాసీల దుస్థితి .. నేటికీ అందని మంచినీరు

Ram Narayana

ర్యాలీలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. 50 మందికి గాయాలు.. !

Ram Narayana

భారత్-అమెరికా బంధం చల్లబడింది.. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన!

Ram Narayana