ఆంధ్రప్రదేశ్

ఏపీలో భూప్రకంపనలు.. వినుకొండకు సమీపంలో భూకంప కేంద్రం!

  • పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూకంపం
  • రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదు
  • రాబోయే రోజుల్లో కూడా భూకంపాలు వస్తాయన్న నిపుణులు

ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదయింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. 

భూప్రకంపనల కారణంగా దర్శి, వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 

దీనిపై నిపుణులు స్పందిస్తూ… రాబోయే రోజుల్లో కూడా మరిన్ని భూకంపాలు రావచ్చని తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో తరచుగా భూమి కంపిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నెలల క్రితం తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే.

Related posts

కేదార్ నాథ్ లో తప్పిపోయిన ఏపీ మహిళ.. ఆదుకున్న గూగుల్ ట్రాన్స్ లేటర్

Drukpadam

ఈవీఎం బ్యాలెట్ పత్రంలో చిన్నగా సీతక్క ఫొటో.. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద అర్ధరాత్రి ధర్నా

Ram Narayana

వ‌ల్ల‌భ‌నేని వంశీకి 14 రోజుల రిమాండ్‌.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!

Ram Narayana