ఆంధ్రప్రదేశ్

వైఎస్ భారతికి లీగల్ నోటీసులు పంపిన రఘురామకృష్ణరాజు…

  • తన గౌరవానికి భంగం కలిగించేలా సాక్షిలో కథనాలు రాస్తున్నారన్న రఘురామ
  • వైఎస్ భారతితో పాటు బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు నోటీసులు
  • తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్

సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర ఈరోజు నోటీసులు పంపించారు.

తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని నోటీసులో రఘురామ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేకాదు, నష్టపరిహారంగా తనకు కోటి రూపాయలు ఇవ్వాలని… ఆ మొత్తాన్ని అమరావతి రైతులకు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రఘురామ నోటీసులకు వైఎస్ భారతి, ఇతరులు ఎలా స్పందింస్తారో వేచిచూడాలి.

Related posts

ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ యస్ ఎమ్మెల్యేల్లో మార్పులు చేర్పులకు అవకాశం …

Drukpadam

ఈవినింగ్ 7లోపు డిన్నర్ చేస్తే.. లాభం ఏంటో తెలుసా..?

Ram Narayana

బాలికలతో అనుచిత ప్రవర్తన… ఉపాధ్యాయుడిపై వేటు…

Ram Narayana