జాతీయ వార్తలు

తెలంగాణకు చెందిన ఆటిజం బాధితుడిపై మోదీ ప్రశంసల వర్షం…

..

తెలంగాణకు చెందిన ఆటిజం బాధితుడిపై మోదీ ప్రశంసల వర్షం…

  • వరంగల్ సభకు హాజరైన మోదీని కలిసిన కామిశెట్టి వెంకట్
  • నాటు నాటు పాట పడి, డ్యాన్స్ చేసిన వెంకట్
  • అతడి దృఢ సంకల్పానికి సెల్యూట్ అంటూ మోదీ ట్వీట్

తెలంగాణకు చెందిన ఆటిజం బాధితుడు కామిశెట్టి వెంకట్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆయన  ప్రతిభ అసాధారణం, యువశక్తికి అతనో పవర్ హౌస్ అని కొనియాడారు. ఆటిజాన్ని అవరోధంగా భావించకుండా సింగింగ్, డ్యాన్స్ లో ప్రతిభ కనబరుస్తున్న ఆయన శనివారం వరంగల్ సభలో పాల్గొన్న ప్రధాని ఎదుట తన ప్రతిభను చాటుకున్నారు. ‘నాటు నాటు పాటకు నృత్యం చేశాడు. దాంతో,మోదీ వెంకట్ ప్రతిభను ప్రశంసించారు. ఆటిజాన్ని అవరోధంగా భావించకుండా గానం కొనసాగించాడన్నారు. నాటు నాటు పాడటమే కాకుండా నృత్యం కూడా చేశాడని పేర్కొన్నారు. అతడి దృఢ సంకల్పానికి సెల్యూట్ అంటూ ప్రధాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వెంకట్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను షేర్ చేశారు.

Related posts

సీక్రెట్‌గా మొబైల్ వాడుతోందని భార్యను చంపి.. ఇంటి పెరట్లోనే పాతిపెట్టిన భర్త…

Ram Narayana

కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం: కాంగ్రెస్‌కు అనుకోని ‘హిందూ’వరం!

Drukpadam

కర్ణాటక అసెంబ్లీలో ‘హనీ ట్రాప్’ రగడ… విచారణకు సిద్ధమైన ప్రభుత్వం!

Ram Narayana