ఆంధ్రప్రదేశ్

పొంగులేటికి ఊరట.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కౌంటర్‌ ఆదేశం

 తెలంగాణ హైకోర్టులో ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు చెందిన SR గార్డెన్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. 

తన భూముల్లో ప్రభుత్వం సర్వే చేయించడంపై కాంగ్రెస్‌ నేత పొంగులేటి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్టేటస్ కో ఆర్డర్ జారీచేసిన హైకోర్టు.. సర్వే చేసి రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించాలని.. అప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సర్కార్‌ను ఆదేశించింది. అగస్ట్ 1వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

Related posts

పవన్ పై మరోసారి ప్రకాశ్ రాజ్ విమర్శలు

Ram Narayana

ప్రభుత్వ జీతం నాకు వద్దు.. ఒక్క రూపాయి కూడా తీసుకోను: మంతెన సంచలన నిర్ణయం

Ram Narayana

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం!

Ram Narayana