Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఆయిల్ ఫామ్ మీద కేంద్రం నిబంధన సరికాదు…ఎమ్మెల్యే సండ్ర

ఆయిల్ ఫామ్ మీద కేంద్రం నిబంధన సరికాదు

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆయిల్ ఫామ్ కి పెద్ద ఎత్తున ఆదరణ లభించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పాలసీ ఈ ఆయిల్ ఫామ్ రికవరీ మీద 13,346 రూపాయలు ప్రభుత్వానికి ఉండాలని నిబంధన పెట్టడం జరిగిందని దాని వలన తెలంగాణకు మాత్రమే కాకుండా యావత్ భారత దేశంలోని ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని దీనిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఉదృతం చేయాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి కమిటీలు తెలంగాణ రాష్ట్రం లేకపోవడం వల్ల టన్నుకి 16,000 నుండి 17,500 వరకు చెల్లిస్తున్నామని ఎలాంటి గొప్ప నిర్ణయం వల్ల మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ , అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ప్రైవేటుగా ఉన్న ఫ్యాక్టరీలు కూడా మన తెలంగాణ రాష్ట్రం ను చూసి అనుసరిస్తున్నాయని తెలిపారు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టే సత్తుపల్లిలో వేలకోట్ల రూపాయల విలువచేసే భూమిని కూడా రైతులు త్యాగం చేశారని అలాంటి సింగరేణి దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం వేలం వేసి లాక్కోవడం కరెక్ట్ కాదని ఎప్పటికే పెద్ద ఎత్తున ఈ విషయంపై ఆందోళన తెలియజేశామని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వేలం ప్రక్రియని ఆపాలని దానిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఎమ్మెల్యే సండ్ర కోరారు.

Related posts

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ …పంటల బీమా పథకం అమలుకు కసరత్తు…

Ram Narayana

తుమ్మల తిరిగి మంత్రిగా రావడంతో భద్రాచలం రెండవ బ్రిడ్జి పనులు పరుగులు

Ram Narayana

జెమిని టీవీ సీరియల్ తారల చే ఖమ్మం లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

Ram Narayana

Leave a Comment