ఆరోగ్యం

గుండెపోటుతో రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కమిషనర్

  • బేగంపేటలో గుండెపోటుతో రోడ్డుపై పడిపోయిన గుర్తు తెలియని వ్యక్తి
  • వెంటనే సీపీఆర్ చేసిన ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి
  • ఆ తర్వాత అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలింపు
  • ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్‌పై ప్రశంసల వెల్లువ

బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద ఓ వ్యక్తి కిందపడిపోగా నార్త్ జోన్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ కానిస్టేబుల్ బాలయోగి తదితరులు ఆయనకు సీపీఆర్ చేసి కాపాడారు. ఆ తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. బుధవారం బేగంపేటలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి గుండెపోటు రావడంతో రోడ్డు మీద పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ అధికారి మధుసూదన్ రెడ్డి అతనిని గమనించి సీపీఆర్ చేశారు. ఆయనకు ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయం చేశారు. ఆ తర్వాత బాధితుడిని అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

స్మార్ట్‌వాచ్‌ తో షుగర్‌ కు చెక్.. ముందే హెచ్చరించే సరికొత్త ఆవిష్కరణ!

Ram Narayana

ఒత్తిడితో మొదలుకొని మతిమరుపు దాకా.. మొబైల్ ఫోన్ తో వచ్చే కొన్ని అనారోగ్యాలు!

Ram Narayana

ఆయుర్వేదం ప్రకారం ఇవి అమృతం.. వాటికి ఎందుకింత ప్రత్యేకత?

Ram Narayana