Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జమిలి ఎన్నికల దిశగా అడుగులు …తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు అవకాశం …?

  • దేశంలో ఏకకాలంలో లోక్ సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
  • ఒకే దేశం-ఒకే ఎన్నిక కార్యాచరణపై కేంద్రం ఆలోచన
  • మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చైర్మన్ గా కమిటీ
  • తాజాగా సభ్యులను నియమించిన కేంద్రం

దేశంలో లోక్ సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం-ఒకే ఎన్నిక కార్యాచరణకు సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

తాజాగా ఈ కమిటీలో సభ్యులను నియమించింది. 8 మంది సభ్యులతో ఈ కమిటీకి రూపకల్పన చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా రామ్ నాథ్ కోవింద్ వ్యవహరిస్తారు. అమిత్ షా, అధిర్ రంజన్, గులాంనబీ ఆజాద్, ఎన్ కే సింగ్, హరీశ్ సాల్వే, సుభాష్, సంజయ్ కొఠారీ కమిటీలో సభ్యులుగా ఉంటారు. 

ఒకే దేశం-ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కాగా, సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన కేంద్రం… ఈ సమావేశాల్లోనే ఒకే దేశం-ఒకే ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

జమిలి ఎన్నికల దిశగా అడుగులు …తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు అవకాశం

ఒకే దేశం ఒకే ఎన్నిక …పరిశీలనకు 8 మంది సభ్యులతో కమిటీ ని కేంద్ర ఏర్పాటు చేసింది…దీన్నే జమిలి ఎన్నికలు అనికూడా అంటారు …ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉంది. అయితే పెద్ద దేశమైన భారత్ లో జమిలి ఎన్నికలు సాధ్యమేనా అనే సందేహాలు లేకపోలేదు…29 రాష్ట్రాలు 140 కోట్ల జనాభా , 542 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇందుకోసం పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణకు చట్టం చేయాలి అందుకు 14 రాష్ట్రాల్లోని శాసనసభలు తీర్మానాలు చేసి పంపాలి. అంతే కాకుండా లోకసభలో ,రాజ్యసభలో 2 /3 మెజార్టీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదించాలి …ఇప్పుడున్న లెక్క ప్రకారం లోకసభలో, రాజ్యసభలో వీధివీధిగా 67 శాతం చొప్పున సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ పక్షాల బలం లోకసభలో 61 శాతం ఉండగా , రాజ్యసభలో 40 శాతం మాత్రమే ఉంది…ఒకవేళ రెండు సభల్లో రెండు బై మూడవ వంతు బిల్లుకు మద్దతు తెలిపితే చట్టం చేసే అవకాశం ఉంటుంది.. దీంతో రేపు ఎన్నికలు జరగాల్సిన తెలంగాణ , రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ , మధ్యప్రదేశ్ , లాంటి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనా విధించి రెండు మూడు నెలల తర్వాత ఎన్నికలు జరిపే అవకాశం ఉంది… అప్పడు గవర్నర్ ల ఏలుబడిలోకి ఆ రాష్ట్రాల పాలనా పోతుంది …

Related posts

బీజేపీ ,విచ్చిన్న వినాశకర విధానాలు దేశానికి అరిష్టం …సీఎం కేసీఆర్ ఫైర్!

Drukpadam

బస్సుకు దారివ్వలేదని.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదిన ప్రైవేటు బస్సు డ్రైవర్లు..

Ram Narayana

రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన సీఎం జగన్

Ram Narayana

Leave a Comment