జనరల్ వార్తలు ...

షాకింగ్.. 2 గంటల్లో 61 వేల పిడుగుపాటు ఘటనలు!

  • ఒడిశాలో శనివారం అసాధారణ ఘటన
  • పిడుగుపాట్ల కారణంగా 12 మంది మృతి, 14 మంది గాయాలపాలు
  • మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

ఒడిశాలో శనివారం అసాధారణ రీతిలో పిడుగుపాలు ఘటనలు వెలుగు చూశాయి. కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 61 వేల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనల్లో 12 మంది మృతి చెందగా 14 మంది గాయాలపాలయ్యారు. సెప్టెంబర్ 7 తరువాత వాతావరణం రాష్ట్రంలో సాధారణ స్థితికి వస్తుందని భారత వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ ఆ తరువాత కూడా పిడుగుపాట్లు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు వెల్లడించారు. 

ఇక బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం రాబోయే రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. కాగా, పిగుడుపాటుకు మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సాహూ తెలిపారు.

Related posts

నేపాల్‌లో అల్లర్లు.. భారత్ సరిహద్దులో హై అలర్ట్!

Ram Narayana

How the US tax code bypasses women entrepreneurs

Ram Narayana

రాష్ట్ర మంత్రి పొంగులేటి మనుమరాలితో మథుర క్షణాలు…

Ram Narayana