ఆంధ్రప్రదేశ్

ఆవు పాలు పితికిన టీటీడీ చైర్మన్ భూమన

  • ఎస్వీ గోశాల, గో మందిరాన్ని దర్శించిన భూమన కరుణాకర్ రెడ్డి
  • ప్రతి ఒక్కరూ గో సంరక్షణ చేపట్టాలని పిలుపు
  • సాహివాల్ జాతి ఆవుల అభివృద్ధికి కేంద్రం రూ.49 కోట్లు మంజూరు చేసిందని వెల్లడి

కృష్ణాష్టమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వీ గోశాల, అలిపిరి వద్ద ఉన్న గో మందిరంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడి ఆలయంలో స్వామివారికి పూజలు జరిపారు. ఓ ఆవు నుంచి స్వయంగా పాలు పితికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  గో సంరక్షణ బాధ్యత భారతీయులందరిపైనా ఉందని తెలిపారు. గోవులను తల్లిగా పూజించడం మన సంస్కృతిలో భాగమని అన్నారు. సాహివాల్ జాతి ఆవుల అభివృద్ధికి కేంద్రం రూ.49 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు.

Related posts

వచ్చేవారం తూర్పు తీర ప్రాంతాలకు సైక్లోన్ మోచా ముప్పు!

Drukpadam

చక్రస్నానంతో ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు… శ్రీవారి హుండీ ఆదాయం రూ.25.12 కోట్లు

Ram Narayana

సింహాచలం ఘటనలో ఏడుగురు అధికారులపై వేటు!

Ram Narayana