చంద్రబాబు బెయిలు, క్వాష్ పిటిషన్ లపై ముగిసిన వాదనలు …తీర్పు రిజర్వు…!
హైకోర్టు లో వాదనలు వినిపించిన సుప్రీం న్యాయవాదులు
చంద్రబాబు పక్షాన లూద్ర, సాల్వే సి ఐ డి తరుపున ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహిత్గీ
హోరాహోరీ వాదనలు …కిక్కిరిసిన కోర్ట్ హాల్
చంద్రబాబు అరెస్టు ఆక్రమణ , అతనికి స్కిల్ డవలప్మెంట్ సంస్థకు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని అందువల్ల ఆయన పై పెట్టిన అక్రమకేసులను కొట్టి వేయాలని కోరారు ..ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు తరుపున సిద్దార్ద్ర లూద్ర, హరీష్ సాల్వే,దమ్మాలపాటి శ్రీనివాస్ రావు అనే లాయర్లు వాదించారు . చంద్రబాబుపై సెక్షన్ 409 వర్తించదని ,అసలు స్కిల్ డవలప్మెంట్ లో అవినీతి జరగలేదని తమ వాదనలు వినిపించారు . మరో పక్క ఏపీ సి ఐ డి తరుపున ప్రభుత్వ లాయర్లతో పాటు ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహిత్గీ తన వాదనలను గట్టిగ వాదించారు . చంద్రబాబు అవినీతి బయట పడినందునే అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు . దేశంలో ఇలాంటి కేసుల తీర్పులను ఆయన ఉదహరించారు .ఎక్కడ స్కిల్ డవలప్మెంట్ లేకుండానే డబ్బు కాజేశారని వాదించారు . మొత్తం రిపోర్ట్ 900 పేజీలు ఉందని అది మొత్తం చదువుకొని రావడానికి టైం పడుతుందని అన్నారు . ఇరు పక్షాల వాదనలను శ్రద్దగా విన్న డివిజన్ బెంచ్ తీర్పుపై వాయిదా వేసింది…
ఏపీ హైకోర్టులో ఈ వాదనలు స్వయంగా వినేందుకు హైకోర్టు న్యాయవాదులు ఆసక్తి చూపారు . దీంతో కోర్టు హాల్ కిక్కిరిసి పోయింది…ఈ సందర్భంగా కోర్ట్ ప్రాగణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు . ఇక తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు ఒక పక్క కొత్త పార్లమెంట్ లో సమావేశాలు ప్రారంభంకావడంతోపాటు అక్కడ జరుగుతన్న చర్చలను , ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో జరుగుతున్న వాదనల విశేషాలకు టీవీ లకు అతుక్కు పోయారు .అయితే ఇరు పక్షాల వాదనలను విన్న హైకౌట్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది…