పార్లమంట్ న్యూస్ ...

లోక్ సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

  • లోక్ సభలోకి దుండగుల చొరబాటుపై దద్దరిల్లుతున్న పార్లమెంట్
  • ఇప్పటి వరకు 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
  • ఈరోజు ఫరూక్ అబ్దుల్లా, శశిథరూర్, మనీశ్ తివారీ తదితరుల సస్పెన్షన్
49 more MPs suspended from Lok Sabha

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. లోక్ సభలోకి దుండగుల చొరబాటు అంశంపై ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. డిసెంబర్ 13న జరిగిన ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. తాజాగా లోక్ సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ఫరూక్ అబ్దుల్లా, శశిథరూర్, ఫైజల్, కార్తీ చిదంబరం, సుప్రియా సూలే, మనీశ్ తివారీ, డింపుల్ యాదవ్ తదితరులు ఉన్నారు. తాజా సస్పెన్షన్లతో కలిపి ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య (ఉభయ సభలు) 141కి చేరుకుంది. లోక్ సభలో 95 మంది, రాజ్యసభలో 46 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వీరందరినీ ఈ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేశారు.

Related posts

మహిళలను మోసంచేసి పెళ్లి చేసుకుంటే పదేళ్లు జైలుకే.. కొత్త బిల్లులో కేంద్రం ప్రతిపాదన

Ram Narayana

రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణ స్వీకారం …

Ram Narayana

ఈసీని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: లోక్‌సభలో రాహుల్ గాంధీ

Ram Narayana