Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పాలనలో పట్టుకోసం రేవంత్ అడుగులు… 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వ్యవరాల్లో పట్టుకోసం అడుగులు వేస్తున్నారు …ఇప్పటికే కొందరు సీనియర్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులను తమ అవసరాలకు అనుగుణంగా నియమించుకోగా , రాష్ట్ర వ్యాప్తితంగా మరికొందరిని మార్చాల్సి ఉంది …రాష్ట్ర స్థాయిలో 20 అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి…

డిజిపిగా రవిగుప్తకు పూర్తిస్థాయి బాధ్యతలు.
మాజీ డిజిపి అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ డిజిగా బదిలీ.
హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏసీబీ డిజిగా బదిలీ.
రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ.
అభిలాష్ బిస్తాను అడిషనల్ డిజి తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ.
సౌమ్య మిశ్రా జైళ్ళ శాఖ అడిషనల్ డిజిగా బదిలీ.
ఉమెన్స్ సేఫ్టీలో ఉన్న షికా గోయల్ సిఐడి అడిషనల్ డిజిగా బదిలీ.
సిఐడి చీఫ్ గా ఉన్న మహేష్ భగవత్ రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డిజిగా బదిలీ.
ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ ను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డిజిగా బదిలీ చేశారు ….

Related posts

తెలంగాణ‌లో ‘మీ సేవ‌’ ద్వారా మరో 9 ర‌కాల సేవలు…

Ram Narayana

కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓటమి… బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు!

Ram Narayana

 టీఎస్ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం

Ram Narayana

Leave a Comment