తెలంగాణ వార్తలు

విద్యార్థునులకు గుడ్ న్యూస్ …త్వరలో ప్రభుత్వం స్కూటీలు పంపిణి ..

రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్! ఎన్నికల హామీల్లో భాగంగా 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది…హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉండగా.. పేద విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉన్నారు…కేంద్ర సబ్సిడీ పోను ఒక్కో స్కూటీకి 50 వేల రూపాయల చొప్పున 70 వేల స్కూటీలకు రూ.350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. విధివిధానాలు, దరఖాస్తు చేసుకునే వివరాలు త్వరలో విడుదల. ఈపథంలోకి హైస్కూల్ విద్యార్థులు వచ్చే అవకాశం లేదు …ఎందుకంటే హైస్కూల్ విద్యార్థినులకు 18 నిండే అవకాశం లేదు …

Related posts

ఉస్మానియాలో విషాదం.. సీనియర్ వైద్యుల వేధింపులతో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య!

Ram Narayana

రాష్ట్రంలో జర్నలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు …మంత్రి పొంగులేటి …

Ram Narayana

జాతర ముగింపు.. . మురికికూపంలా మేడారం…

Ram Narayana