ఆంధ్రప్రదేశ్

సంక్రాంతికి ఊరెళ్తాను… రక్షణ కల్పించండి: హైకోర్టులో రఘురామ కృష్ణరాజు పిటిషన్

  • పోలీసులు ఇప్పటికే తనపై 11 కేసులు పెట్టారని.. మరో కేసు పెట్టే అవకాశముందని కోర్టుకు తెలిపిన రఘురామ
  • గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణ
  • రఘురామ తరఫున న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, వై.వి.రవిప్రసాద్ పిటిషన్

సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఊరికి వెళ్లడానికి తనకు రక్షణ కల్పించాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఇప్పటికే తనపై 11 కేసులు పెట్టారని… మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, వై.వి. రవిప్రసాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి… చిత్రహింసలకు గురి చేశారని రఘురామ కృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనపై తప్పుడు కేసులు పెట్టి మరోసారి అరెస్ట్ చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Related posts

వైకుంఠ ద్వార దర్శనాలపై వదంతులు నమ్మొద్దు: టీటీడీ చైర్మన్ స్పష్టత

Ram Narayana

వైసీపీ నాలుగో జాబితా విడుదల.. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఔట్!

Ram Narayana

తిరుమల లడ్డూ కల్తీపై ఏకసభ్య కమిషన్… 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

Ram Narayana