తెలంగాణ వార్తలుప్రమాదాలు ...

తెలంగాణ సచివాలయం సమీపంలో కారు దగ్ధం

  • గురువారం రాత్రి మెయిన్ రోడ్డులో ఘటన
  • ఒక్కసారిగా కారులో మంటలు
  • వెంటనే కారులో నుంచి దిగిన ప్రయాణికులు

తెలంగాణ సచివాలయానికి సమీపంలో ఓ కారు దగ్ధమైంది. మెయిన్ రోడ్డులో గురువారం రాత్రి కాసేపటి క్రితం ఈ ఘటన జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే కిందకు దిగారు. కారులో ఉన్న విలువైన వస్తువులను కూడా బయటకు తీశారు. కారు దగ్ధమైన సమయంలో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ట్రాఫిక్ కాసేపు నిలిచిపోయింది. కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో అందరూ భయానికి గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది.

Related posts

హైడ్రాకు అదనపు సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Ram Narayana

కువైట్‌ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు…

Ram Narayana

రైతు రుణమాఫీ పట్ల కేసీఆర్ కు అభినందనల వెల్లువ …అసెంబ్లీ లో సీఎం ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఖమ్మం ఎమ్మెల్యేలు…

Ram Narayana