కోర్ట్ తీర్పులు

పెళ్లి చేసుకోకున్నా సహజీవన భాగస్వాగస్వామికి భరణం చెల్లించాల్సిందే.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

  • విడిపోయిన భాగస్వామికి ప్రతినెల రూ. 1500 చెల్లించాలన్న కిందికోర్టు
  • హైకోర్టులో సవాలు చేసిన పిటిషనర్
  • సహజీవనానికి ఆధారాలు లేవన్న కారణంతో భరణాన్ని నిరాకరించలేమన్న హైకోర్టు
  • లివిన్ రిలేషన్‌షిప్ ముగిసినా మహిళను ఉత్తచేతులతో వదిలివేయడానికి లేదని స్పష్టీకరణ

స్త్రీపురుషుల మధ్య లివిన్ రిలేషన్‌షిప్ ముగిసినప్పటికీ మహిళను ఉత్తచేతులతో వదిలివేయడానికి లేదని, ఆమెకు మనోవర్తి చెల్లించాల్సిందేనని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమెను చట్టబద్ధంగా వివాహం చేసుకోకున్నా కొంతకాలంపాటు కలిసి జీవించినందుకు భరణానికి ఆమె అర్హురాలేనని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

తనతో సహజీవనం చేసిన మహిళకు ప్రతినెలా రూ. 1500 చెల్లించాలంటూ కిందికోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ హైకోర్టులో సవాలు చేశాడు. కేసును విచారించిన హైకోర్టు కిందికోర్టు తీర్పును సమర్థించింది. సహజీవనానికి సంబంధించిన ఆధారాలు లేవన్న కారణంగా భరణాన్ని నిరాకరించలేమని స్పష్టం చేసింది.

Related posts

సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్

Ram Narayana

ఇంటిలో అద్దెకు ఉండే వారు ఇంటి యజమానులు కాలేరు: సుప్రీంకోర్టు..

Ram Narayana

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టులో విచారణ

Ram Narayana