తెలంగాణ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాఫ్తుకు పిటిషన్… విచారణ 10కి వాయిదా

  • కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాఫ్తు జరపాలన్న పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
  • ఈ ఐదు పిటిషన్లపై కలిపి ఎల్లుండి విచారణ చేపడతామన్న హైకోర్టు
  • ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ వేశామన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాఫ్తు జరపాలన్న పిటిషన్లపై విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన తెలంగాణ హైకోర్టు… ఈ ఐదు పిటిషన్లను కలిపి ఎల్లుండి విచారణ చేపడతామని తెలిపింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ వేశామని కోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఇప్పటికే జ్యూడీషియల్ విచారణ వేసినందువల్ల సీబీఐ విచారణ అవసరం లేదన్నారు.

Related posts

భయమెందుకు ? విచారణకు రండి: కేసీఆర్‌కు నోటీసులపై మంత్రి ఉత్తమ్

Ram Narayana

ఓ సైకో మంత్రి సభను అడ్డుకునే ప్రయత్నాలు చేశాడు: రేవంత్ రెడ్డి !

Drukpadam

కొత్త హంగులతో తెలంగాణ శాసన మండలి భవనం ప్రారంభం…

Ram Narayana