ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

విజయవాడలో దారుణం… డాక్టర్ కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

  • ఇంటి బయట ఉరేసుకుని కనిపించిన డాక్టర్ శ్రీనివాస్
  • ఇంట్లో రక్తపు మడుగులో నాలుగు మృతదేహాలు
  • కుటుంబ సభ్యులను హత్య చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అనుమానం 
  • మృతుల్లో ఇద్దరు పిల్లలు

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. డాక్టర్ డి.శ్రీనివాస్ (40) ఇంటి బయట ఉరేసుకోగా, ఇంటి లోపల శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65), భార్య ఉష (38), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8) రక్తపు మడుగులో విగత జీవుల్లా కనిపించారు. 

ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి గురునానక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా, కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత, శ్రీనివాస్ ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. 

కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఆయన తన ఆసుపత్రిని లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు… బీఆర్ఎస్ నేతలపై ఫైర్

Drukpadam

20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర!

Ram Narayana

నేడు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం..

Drukpadam