తెలంగాణ వార్తలు

ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కేసు… పోలీసుల అదుపులో నిందితుడు ..

  • ప్రజాభవన్ పేలబోతుందంటూ నిన్న ఫోన్ చేసిన శివరామకృష్ణ
  • భవనాన్ని జల్లెడ పట్టి ఫేక్ కాల్‌గా గుర్తించిన పోలీసులు
  • నిందితుడు మద్యం మత్తులో ఫోన్ చేసినట్లుగా గుర్తించిన పోలీసులు

ప్రజాభవన్‌కు వచ్చిన బాంబు బెదిరింపు కేసులో పంజాగుట్ట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్‌లో బాంబు పెట్టామని.. కాసేపట్లో పేలబోతుందని నిన్న పోలీసులకు ఫోన్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్‌ను జల్లెడ పట్టారు. రెండు గంటలకు పైగా తనిఖీలు చేసి… ఫేక్ కాల్‌గా గుర్తించారు.

ఈరోజు నిందితుడు శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం సేవించి కంట్రోల్ రూంకు ఫోన్ చేసినట్లు గుర్తించారు. శివరామకృష్ణ ముషీరాబాద్‌లో ఉంటున్నాడు. అతనిని గుంటూరు జిల్లా వాసిగా గుర్తించారు.

Related posts

కార్పొరేట్ వర్సిటీలకు దీటుగా ఉస్మానియా.. రూ.1000 కోట్లతో అభివృద్ధి!

Ram Narayana

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సాయం కోసం అర్ధిస్తుంటే.. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు!

Ram Narayana

సీఎంఆర్ఎఫ్ క్రింద రూ. 1070 కోట్ల ఆర్థిక సహాయం

Ram Narayana