తెలంగాణ వార్తలు

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు…

  • తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
  • నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండలోకి ప్రవేశం 
  • ఈ ఏడాది వారం రోజుల ముందే రాక 

నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలు నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండలో ప్రవేశించాయి. సాధారణంగా తెలంగాణలోకి జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈసారి మాత్రం వారం రోజుల ముందే ప్రవేశించాయి.

ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.

Related posts

తెలంగాణలో స్థానిక సమరానికి సర్వం సిద్ధం.. రెండో వారంలోనే నోటిఫికేషన్!

Ram Narayana

కన్నియాకుమారి నుంచి తిరుగుపయనమైన రేవంత్ రెడ్డి!

Ram Narayana

సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు… కేసీఆర్ అభినందనలు

Ram Narayana