తెలంగాణ వార్తలు

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు…

  • తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
  • నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండలోకి ప్రవేశం 
  • ఈ ఏడాది వారం రోజుల ముందే రాక 

నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలు నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండలో ప్రవేశించాయి. సాధారణంగా తెలంగాణలోకి జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈసారి మాత్రం వారం రోజుల ముందే ప్రవేశించాయి.

ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు లేఖ…

Ram Narayana

రోడ్డు విస్తరణ.. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత!

Ram Narayana

విద్యుత్ రంగాన్ని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana