Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు…

  • పాట్నా, కోయంబత్తూరు, జయపుర, వడోదర తదితర విమానాశ్రయాలకు బెదిరింపు
  • విమానాశ్రయాల్లో బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు
  • విమానాశ్రయాల్లో భద్రత పెంపు

దేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. పాట్నా, కోయంబత్తూరు, జయపుర, వడోదర సహా పలు విమానాశ్రయాలకు బెదిరింపు వచ్చింది. కోయంబత్తూరు విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.30 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాశ్రయంలో బాంబు స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. విమానాశ్రయంలో భద్రతను పెంచారు. ఇతర విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అన్ని విమానాశ్రయాలలోనూ తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానిత వస్తువులు గుర్తించలేదు. బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలగలేదని అధికారులు తెలిపారు.

Related posts

భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నించిందా …?

Ram Narayana

అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో అమెజాన్‌లో స్వీట్ల విక్రయం.. వార్నింగ్ ఇచ్చిన సీసీపీఏ

Ram Narayana

నిప్పు అంటుకుందనుకుని.. రైల్లోంచి దూకేసిన ప్రయాణికులు…

Ram Narayana

Leave a Comment